ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు!

  • వేలంలో మొత్తం 169 ఆటగాళ్లు
  • 56 మంది విదేశీయులు
  • ఈసారి వేలంలో ఐపీల్ చరిత్రలోనే అత్యధిక మొత్తం ఖర్చు
బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన ఐపీల్ ఆటగాళ్ల వేలంలో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుపోయారు. అందులో 56 మంది విదేశీయులు. మ్యాచ్ లకు మించిన ఉత్కంఠ రేపుతూ ఈ ఆటగాళ్ల వేలం జరిగింది. మొత్తానికి ఇప్పటిదాకా ఐపీల్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అత్యధిక మొత్తాన్ని ఆటగాళ్ల కోసం వెచ్చించారు. ఈసారి వేలంలో అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్ల పేర్ల వివరాలు...

ఇషాంత్ శర్మ, ప్రజ్ఞాన్ ఓజా, వరుణ్ ఆరోన్, అశోక్ దిండా, రజత్ భాటియా, ఉన్ముక్త్ చంద్, శ్రీనాథ్ అరవింద్, రిషి ధావన్, ఇక్బల్ అబ్దుల్లా, మిథున్, హెన్రిక్స్, కోరె ఆండర్సన్, మోర్నీ మోర్కెల్, సిమన్స్, షాన్ మార్ష్, మోర్గాన్, హేల్స్, తిసార పెరీరా, హోల్డర్, స్టెయిన్, మలింగా, రూట్, ఆమ్లా, గప్తిల్, ఫాల్కనర్, బెయిర్ స్టో, మెక్లేనగన్, హేజిెల్ వుడ్, జంపా, శామ్యూల్ బద్రి, హెడ్.
Go Back to Shorts
ipl
Cricket
bcci
iplauction

More Telugu News